మిర్యాలగూడలో ఘోర విషాదం జరిగింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో అత్యంత హృదయవిదారకమైన ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన అమ్ముమ్మ, మనవడు, మనవరాలు నిద్రిస్తున్న సమయంలో మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా రేకుల ఇంట్లో మొదలైన మంటలు, ఆపై గ్యాస్ సిలిండర్ పేలడంతో క్షణాల వ్యవధిలో ఇల్లంతా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో వనం చంద్రకళ (45), ఆమె మనవడు లక్ష్మణ్ (16), మనవరాలు ప్రణతి (14) అక్కడికక్కడే ప్రాణాలు […]

